telugu navyamedia
సినిమా వార్తలు

కార్తికేయ మూవీటీమ్​పై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్​ ప్రశంసలు

నిఖిల్ సిద్ధార్థ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కార్తికేయ 2 . ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేట‌ర్స్‌ వద్ద తన సత్తా ను కొనసాగిస్తోంది.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఉత్తర భారతదేశంలో కూడా సంచలన విజయం సాధించింది. టాలీవుడ్​ టు బాలీవుడ్​ అన్ని చోట్లా బాక్సాఫీస్​ ముందు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. నార్త్​లో అయితే ఏకంగా అగ్ర కథానాయకులైన ఆమిర్​ ఖాన్ లాల్​సింగ్​ చడ్డా, అక్షయ్​కుమార్​ రక్షాబంధన్​ సినిమాలను సైతం పక్కకు నెట్టి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తోంది.

తాజాగా కార్తికేయ మూవీటీమ్​పై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చ్​ను ప్రశంసలు కురిపించారు. స్వయంగా చందూ మొండేటిని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చందూ.. అమితాబ్​తో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఫోటోలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చందూ మొండేటి నమస్కారం చేస్తున్నారు. “ఆ దీవెనలు!! ధన్యవాదాలు అమితాబ్ బచ్చన్ జీ, లైఫ్ టైమ్ మెమరీస్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది.

అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, హర్ష చెముడు మరియు శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

Related posts