telugu navyamedia
సినిమా వార్తలు

వంశీ పైడిపల్లితో మహేష్ మరో ప్రాజెక్ట్ ?

Mahesh

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో “స‌రిలేరు నీకెవ్వ‌రు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఆర్మీ మేనేజ‌ర్‌గా క‌నిపించి అలరించనున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ ఏ ప్రాజెక్ట్ ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నే విషయంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో మ‌హేష్ త‌ర్వాతి ప్రాజెక్ట్ ఉంటుంద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, మరికొంద‌రు “మ‌హ‌ర్షి”తో మ‌హేష్‌కి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిప‌ల్లితో ఉంటుంద‌ని అంటున్నారు. వంశీ ఇప్ప‌టికే మ‌హేష్‌కి స్టోరీ లైన్ వినిపించాడని అది న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా మొద‌లు పెట్టాడ‌ని విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడా లేదంటే వంశీతోనే మ‌రో సినిమా చేస్తాడా అనేది స‌స్పెన్స్‌గా మారింది. రానున్న రోజుల‌లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

Related posts