telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

Tollywood

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తాజాగా యంగ్‌ ప్రొడ్యూసర్‌ సందీప్‌ కొరిటాల హఠాత్తుగా మరణించారు. ఆదివారం నాడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో టాలీవుడ్‌ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన “స్వామిరారా”, నారా రోహిత్‌ హీరోగా చేసిన “రౌడీ ఫెలో ” సినిమాలకు సందీప్‌ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో స్వామిరారా సూపర్‌ హిట్‌ కాగా… రౌడీ ఫెలో సినిమాకు ప్రశంసలు వచ్చాయి. అయితే.. సందీప్‌ కొరిటాల మృతి పట్ల నారా రోహిత్‌, దర్శకుడు సుధీర్‌ వర్మ సంతాపం తెలిపారు. “నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత నా శ్రేయోభిలాషి సందీప్‌ కొరిటాల ఇకలేరనే వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఈ రోజు ఇంత బాధకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి ” అంటూ నారా రోహిత్‌ ట్వీట్‌ చేశారు. 

Related posts