telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నిర్భయ… శాంతి శాంతి శాంతి…”… మంచు మనోజ్ ట్వీట్

Manchu-Manoj

నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకి ఈ రోజు ఉరి పడింది. ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3 లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష పడటం కూడా దేశంలో ఇదే తొలిసారి. ఈ ఘటనపై సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం తమ స్పందనను తెలియజేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ట్విట్టర్‌తో న్యాయం గెలిచింది అంటూ స్పందిస్తున్నారు. చెడు వేలాడదీయడాన్ని చూడటం కోసం వెయిట్ చేస్తున్నా.. అంటూ నిర్భయ నిందితుల ఉరికి ముందు ట్వీట్ చేసిన మంచు మనోజ్.. ఉరి తీసిన తరువాత ‘RIP నిర్భయ అంటూ ఆమెకు సానుభూతిని తెలియజేస్తూ.. శాంతి, శాంతి, శాంతి’ అని ట్వీట్ చేశారు. మంచు మనోజ్ ట్వీట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీతిజింటా, సుస్మితా సేన్, పీవీపీ, అనసూయ లాంటి సెలబ్రిటీలు ఇప్పటికే తమ స్పందనల్ని తెలియజేయగా.. సామాజిక కార్యక్రమాల్లో నేను సైతం అని ముందుండే మంచు హీరో మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Related posts