telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” సీక్వెల్ ?

Ay

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో..`. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. రికార్డు కలెక్షన్లతో `బాహుబలి` తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో `అల వైకుంఠపురములో..` చిత్రబృందం శుక్రవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజపాద దర్శనం చేసుకోనుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, చిత్ర నిర్మాత చినబాబు స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. కాగా… `అల వైకుంఠపురములో..`కి చిత్రానికి సీక్వెల్ చేయాలని త్రివిక్రమ్, అల్లు అర్జున్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ ఇప్పటికే కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాత ఈ సీక్వెల్ గురించి ఆలోచిస్తారట. సినిమా క్లైమాక్స్‌లో బన్నీ కోట్లాది రూపాయలకు అధిపతి అవుతాడు. అక్కణ్నుంచే సీక్వెల్‌ను ప్రారంభించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఈ భాగంలో బన్నీని అల్ట్రా రిచ్‌గా చూపించాలనుకుంటున్నారట. `అల వైకుంఠపురములో..`కి సీక్వెల్ చేయాలని బన్నీ కూడా బలంగా అనుకుంటున్నాడట. మరి, ఈ సీక్వెల్ కార్యరూపం దాలుస్తుందో, లేదో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts