టీవీ9 నూతన యాజమాన్యం ఫిర్యాదుతో సినీనటుడు శివాజీ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చారణకు గురువారం హాజరు కావలసి ఉండగా తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని సైబరాబాద్ పోలీసులకు శివాజీ ఈమెయిల్ చేశారు.
టీవీ9 లో వాటాల కొనుగోలు కేసులో హాజరుకావాల్సిందిగా పోలీసుల పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ శివాజీ హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారం క్రితం శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సైబరాబాద్ పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు.