కన్నడ భామ రష్మిక మందన్న చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఎత్తైన ప్రాంతం. అక్కడొక అరుగు ఉంది. దానిపై ఓ బాలిక కూర్చొని ఉంది. చేతికి గడియారం. ముఖంపై వాలిన ముంగురులు. చాలా స్టైలిష్ గా దిగిన బ్లాక్ వైండ్ ఫొటో ఇపుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. పాత ఆల్బమ్లోని ఫొటో ఇది.. క్యాప్షన్తో ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ఈ స్టిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది. గీతగోవిందం సూపర్ హిట్ సాధించిన తర్వాత చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక. టాప్ స్టార్లతో నటించే అవకాశాన్ని కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిందీ భామ. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది.
Chip off the old block✨🐒 pic.twitter.com/6d6Czu7lyP
— Rashmika Mandanna (@iamRashmika) 2 November 2019
ఆ హీరో కూడా డ్రగ్స్ తీసుకునేవాడు… సీనియర్ హీరోయిన్ కామెంట్స్