ఎన్నికల్లో జత కట్టడం మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం నీ నైజం అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ..గత ఎన్నికల్లో బీజేపీ, పవన్తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్తో అంటకాగుతున్నావని అన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబును రాష్ట్ర ప్రజానీకం నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. పవన్కల్యాణ్తో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. టీడీపీ, పవన్ అసలు విడిపోతే కదా పొత్తు గురించి మాట్లాడేందుకని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఫైనాన్షియర్గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్కు ఫైనాన్షియర్గా ఉన్నారని పేర్కొన్నారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబుకు సొంతంగా పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు. పార్టీలన్నీ విడిగా వచ్చినా, కలసి వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని రోజా జోస్యం చెప్పారు.