విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) కూడా స్పందించింది. ముందుగా, రూ.50 కోట్లు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు రూ.50 కోట్ల చెక్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని మొత్తాన్ని వినియోగిస్తామని చెప్పారు.