telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్

vishakha gas leak

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) కూడా స్పందించింది. ముందుగా, రూ.50 కోట్లు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు రూ.50 కోట్ల చెక్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని మొత్తాన్ని వినియోగిస్తామని చెప్పారు.

Related posts