ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం ఖరారైంది . 25 మందితో టీటీడీ కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి కొనసాగుతున్నారు.
బోర్డు సభ్యుల వివరాలను ఈ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు.
కొత్త పాలక మండలి సభ్యులు..
పాలకమండలిలో రెండోవసారి సభ్యత్వం దక్కించుకున్న మైహోం రామేశ్వరరావు ,
హేటిరో పార్దసారధి రెడ్డి,మారంశెట్టి రాములు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ,ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్….
పాలకమండలిలో చోటు దక్కించుకున్న వ్యాపారవేత్త మారుతి,ఆడిటర్ సనత్,యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి,కోల్ కత్తాకి చెందిన సౌరభ్..
సభ్యులుగా నియమితులైన డాక్టర్ కేతన్ దేశాయ్,కర్నాటక నుంచి శశిధర్,శంకర్….
పాలకమండలి సభ్యులుగా ఏపి నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కాటసాని,
గోర్ల బాబురావు,మధుసూదన్ యాదవ్,కల్వకుర్తి విద్యాసాగర్.
తమిళనాడు వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్,కన్నయ్య….
కర్నాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్ రెడ్డి….
హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ ఏనాడు అడ్డుపడలేదు: చంద్రబాబు