కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం పటిష్ట బందోబస్తు మధ్య మొదలైంది. అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు పై ఉత్కంట నెలకొంది. తొలి ఫలితాల్లో బీజేపీ 10 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండింట, ఒకచోట జేడీఎస్ అభ్యర్థులు మెజార్టీలో ఉన్నట్టు సమాచారం.
పార్టీ ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనెల ఐదో తేదీన రాష్ట్రంలోని గోకాక్, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరేకెరూర్, హోసకోటే, కె.ఆర్.పురం, శివాజీనగర, మహాక్ష్మి లేఅవుట్, యశవంతపుర, విజయనగర, కె.ఆర్.పేట, హుణసూరు, చిక్కబళ్లాపుర నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది.
సెంటు పట్టా పథకంలో దోపిడీ: దేవినేని