ఉల్లి ధరలు దిగివచ్చేవరకు మా పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉల్లిధరల పెరుగుదలపై ఈ రోజు ఉదయం సచివాలయం ఫైర్స్టేషన్ వద్ద చంద్రబాబు నిరసన తెలిపారు. యువనేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఉల్లి దండలు మెడలో వేసుకొని ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.ఓ తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమే అని అన్నారు.
టీడీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో సబ్సిడీపై తక్కువ ధరలకే సరుకులు అందించామని తెలిపారు. ఉల్లి ధరలను ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని అన్నారు. నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు