telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు

BS Yeddyurappa bjp

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. .ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీదే విజయమని చెప్పినప్పటికీ నేతల్లో మాత్రం టెన్షన్ పోవడం లేదు. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి.

ఆ పార్టీ కనీసం ఆరు సీట్లు గెలుచుకుంటేనే ప్రభుత్వం ఢోకా లేకుంటా ఉంటుంది. లేదంటే మైనారిటీలో పడిపోయే అవకాశముంది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ధర్మస్థలిలోని మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లి సాయినాథుడిని దర్శించుకున్నారు.

Related posts