telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం: బీజేపీ నేత కన్నా

Kanna laxminarayana

రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని తరలించాలన్న ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అమరావతిని తరలించవద్దంటూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కులపోరాటంగా వైసీపీ నేతలు చూడటం దారుణమని విమర్శించారు.

ప్రభుత్వం మారినప్పుడల్లా ‘రాజధాని’ ని మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావని అన్నారు. రాజధానిని మార్చాలని విశాఖ ప్రజలేమీ కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో త్వరలోనే కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Related posts