telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరూ నుండి.. మాస్ సాంగ్ వచ్చేస్తుందంటున్న .. దేవిశ్రీప్రసాద్…

mass song will be soon said dsp from

మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమా పై అంచనాలు కూడా పెంచడం జరిగింది.

ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుండో అడుగుతున్న విధంగా తమ సినిమా నుండి మొదట మాస్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ తో పాటు సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా, రేపు సాంగ్స్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెంచడం ఖాయంగా కనపడుతోంది!

Related posts