ఓ మైనర్ బాలిక ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని తెలిపారు.
ఆసుపత్రిలో ప్రసవం చేయగా ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని, బిడ్డ పుట్టిందని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని శిశువును అక్కడే వదిలి వేళ్లేందుకు సదరు మైనర్ బాలిక ప్రయత్నించింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువుకు ఎలాంటి హానీ కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద