telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సెంటు పట్టా పథకంలో దోపిడీ: దేవినేని

devineni uma disappointed on utsav arrangements

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామలో సెంటు పట్టా పథకంలో అవకతవకలపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై  ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

నందిగామలో సెంటు పట్టా పథకంలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. రైతుల వద్ద ముందే చెక్కులు తీసుకొని ఎకరానికి 10 లక్షల రూపాయల చొప్పున బ్యాంకుల నుండి విత్ డ్రా చేస్సినట్టు చెప్పారు. నివాసయోగ్యం కాకపోయినా మీ పార్టీనాయకులు, వారు చెప్పిన భూములే కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో మీ ప్రజాప్రతినిధుల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సీఎం జగన్ ను ప్రశ్నించారు.

Related posts