సత్యనారాయణపురం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సెంటర్ పాయింట్. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే ప్రాంతం ఇది. ఇక్కడ ఉండే బ్రాహ్మణ సామాజిక వర్గమే ప్రతి ఎన్నికల్లో కీలకంగా ఉంటోంది. 2009, 2014 ఎన్నికల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీనితో ప్రధాన పార్టీలన్నీ ఈ ప్రాంతంపైనా దృష్టి కేంద్రీకరించాయి. ఈ సామాజికవర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపుతున్నారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం టీడీపీ వైపు నిలిచింది. ఈ ఎన్నికల్లో కూడా ఆ సామాజికవర్గం చేయి దాటిపోకుండా కాపాడుకోవాలనుకుంటోంది టీడీపీ. దీని కోసం ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మను ప్రచారంలోకి దింపింది.
యామిని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమా భార్య సుజాతతో కలిసి బ్రాహ్మణ సామాజికవర్గాలు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల మంది బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో బొండా ఉమాకు ఈ ప్రాంతంలోనే 28 వేల మెజారిటీ వచ్చింది. దీనితో ఈసారి కూడా బ్రాహ్మణులు టీడీపీకి కొమ్ము కాసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి యామినిశర్మ లాంటి వాళ్లను ప్రచారంలోకి దింపుతుండగా, బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ సాయిరామ్గౌడ్ వంటి వారిని తీసుకువస్తున్నారు. అధికార ప్రతినిధి హోదాలో యామినీశర్మ వైసీపీ, బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
యామిని ప్రచారంతో బ్రాహ్మణ ఓట్లు మరోసారి తమకే వచ్చే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీచేస్తున్న మల్లాది విష్ణు అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో టీడీపీ అప్రమత్తమైంది. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.
ఆ సినిమా అద్భుతం.. ట్వీట్ చేసిన కేటీఆర్!