telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

బాలు పాటను ప్రజలు మర్చిపోరు: జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో  ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే. అందులో నేను ఒక్కడిని. అందుకే బాలసుబ్రమణ్యాన్ని నేను అభిమానిస్తానని అన్నారు. భూమి మీద మనుషులు ఉన్నంత కాలం బాలు పాటను మర్చిపోరని తెలిపారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలో బాలసుబ్రమణ్యంతో కచేరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా బాలసుబ్రమణ్యంతో నాకు ఒక కచేరి చేయించే అవకాశం దొరికిందన్నారు. మా సంగారెడ్డి ప్రజలు బాలసుబ్రమణ్యాన్ని టీవీలో కాకుండా కార్యక్రమం ద్వారా నేరుగా చూడగలిగారని తెలిపారు.

Related posts