telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో 5,606కి చేరిన కరోనా మృతుల సంఖ్య

corona vairus

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో పట్టణాలకే వ్యాపించిన ఆ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో 48 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఆరుగురు కన్నుమూశారు. మరికొన్ని జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5,606కి పెరిగింది.

వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 7,073 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,031 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. ఏపీలో మరో 8,695 మందికి కరోనా నయం అయింది. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,88,169గా నమోదైంది.

Related posts