telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ముంబై : కూలిన పాదచారుల వంతెన… 4 మృతి, 34 మందికి గాయాలు..

walkers bridge collapsed 4 died 34 injured

అర్ధరాత్రి ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ముంబై లోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, 34 మందికి గాయాలయ్యాయి. ఘటన తెలిసిన ఫడ్నవిస్ ప్రభుత్వం మృతులకు ఐదు లక్షలు, గాయపడిన వారికి 50వేల నష్టపరిహారంతో పాటుగా, ఉచితంగా వైద్య సదుపాయాలు ప్రకటించారు.

కాగా, హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఫడ్నవిస్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. 

నిజానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి కాలం చెల్లిన వంతెనలను మూసివేసి, కొత్త ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ, నిర్లక్ష్యం కొండంత పేరుకుపోయిన ఈ దేశంలో మృతి చెందాక, నష్టపరిహారాలు ప్రకటించడంతో సరిపెట్టుకుంటున్నారు.. అటు ప్రజలైతేనేమి, ఇటు ప్రభుత్వం అయితేనేమి అలాగే ఉన్నారు. 

Related posts