telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఫౌజీ ట్రైలర్ విడుదల…

బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు షర్మన్ జోషీ ప్రధాన పాత్రలో నటించిన ఫౌజీ ట్రైలర్ విడుదల అయింది. అయితే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అనేక సినిమాల నుంచి తాజా అప్‌డేట్‌లు వచ్చాయి. మరికొన్న సినిమాలు ట్రైలర్లను విడుదల చేశాయి. అందులో భాగంగా ఈ ఫౌజీ ట్రైలర్ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాను భారత ఆర్మీకి అంకితంగా నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కూడా ఓ భారత జవాను తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలనన్నింటినీ ఎంతో భావోద్వేగ భరితంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో జోషీ బిడిటా, మహి సోని, ముక్తా బిడిటా, షర్మాన్ జోషీలు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కథ మొత్తం కూడా ఓ చిన్నారి కేంద్రంగా రూపొందింది. దేశంలో జరిగే యుద్దాలు కేవలం వీరమరణం పొందిన జవానుల పరంగానే కాకుండా వారి జీవితాల్లో ఉన్నవారు, కుటుంబ సభ్యులను ఎలా ప్రేరేపిస్తాయనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ సినీప్రేమికుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆర్యన్ సక్సేనా దర్శకత్వంలో రూపొందింది. అంతేకాకుండా ఈ సినిమా రన్నింగ్ హార్సెస్ ఫిల్మింస్, ఓవెజ్ ప్రొడక్షన్ వారు నిర్మాస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందా… లేదా అనేది.

Related posts