జనాలను చంపడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంత రావు అని తీవ్రంగా విమర్శించారు. ఆదివారం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తీవ్రంగా ఆరోపించారు. శారదాపీఠాధిపతి ఆశీర్వాదానికి సీఎం కేసీఆర్కు సమయం దొరుకుతుంది కానీ, విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు.
కనీసం మంత్రులు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల పరామర్శలకు వెళ్లలేదని, ప్రభుత్వానికి ఎందుకంత అహంకారమని మండిపడ్డారు. కేసీఆర్ స్వాముల వైపే కాదు, ఓట్లేసిన జనాల వైపూ చూడాలని ఆయన హితవు పలికారు. విద్యార్థుల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లు చేయడం తప్ప, కుటుంబాల్ని పరామర్శించారా? అని వీహెచ్ నిలదీశారు.
రెండు గాజులు ఇస్తే ఎవరు నమ్మరు.. నారా భువనేశ్వరిపై రోజా ఫైర్