ఏపీ ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఎంసెట్ –2019 ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ ప్రకాష్ జూనియర్ కాలేజీ విద్యార్థులు తమ సత్తా చాటారు. విశేష ప్రతిభ కనబర్చి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.ఎం రాహుల్ 943వ ర్యాంక్, జీవి ఎస్ ఎస్ సాహిత్య 1264వ ర్యాంక్, ఎంవి ఎస్వీ అఖిల్ 1377 వ ఆ ర్యాంక్ సాధించి తమ ప్రతిభను కనబరిచారు.
తమక కళాశాల నుంచి ఎంసెట్ కు హాజరైన విద్యార్థుల్లో 92 శాతం మంది అర్హత సాధించారని కాలేజీ ప్రిన్సిపాల్ వివి ఎస్ ఎస్ భానుమూర్తి తెలిపారు. ఎంసెట్ లో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను ప్రకాష్ విద్యా సంస్థల అధినేత సిహెచ్ వి కె. నర్సింహారావు , సెక్రటరీ విజయప్రకాశ్, అధ్యాపకులు అభినందించారు.