telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌ లో జాబ్‌మేళా

govt job notifications in andhrapradesh

విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కల్పించేందుకు ఈ నెల 20న విజయనగర్‌కాలనీ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని హైదరాబాద్‌ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్‌.మైత్రిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో హోం హెల్త్‌ కేర్‌-కెరియర్‌ ట్రీ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థల సంయుక్తాధ్వర్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

శంషాబాద్‌ కార్గో టర్మినల్‌లో స్టాఫ్‌ నర్స్‌100 పోస్టుల ఖాళీల భర్తీకి ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కెరియర్‌ ట్రీ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో 30 కార్గో అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ (2015 తరువాత) ఫాస్‌/ఫెయిల్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11 వేల నుంచి రూ.21వేల వేతనం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. 18-45 ఏండ్ల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, మరిన్ని వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి.రఘుపతి 8247656356 సంప్రదించాలని తెలిపారు.

Related posts