telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు సిద్దిపేట లో సీఎం కేసీఆర్ పర్యటన

Kcr telangana cm

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి దిమ్మ దిరిగే షాక్‌ తగిలింది. దీంతో ఆ గులాబీ బాస్‌ బీజేపీని ఎలా ఎదుర్కొవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగానే సిద్దిపేటలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. నర్సాపూర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభోత్సవం, సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభించి, ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్‌. రంగ నాయక సాగర్ అతిధి గృహం ప్రారంభోత్సవం, కోమటి చెరువు అభివృద్ధి పనులు పరిశీలన, మిట్టపల్లి లో రైతు వేదిక, విపంచి ఆడిటోరియం ప్రారంభించనున్నారు. అంతేకాదు.. ఇండస్ట్రియల్ పార్క్ లో ఐ టీ టవర్ ప్రారంభోత్సవం, పలు ఐటీ కంపెనీలతో సీఎం అద్వర్యంలో ఎంఓయూలు, బాబు జగజ్జీవన్ రావు సర్కిల్ లో నూతన ఆడిటోరియం కి శంకుస్థాపన, సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయం టీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌. చివరగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనున్నారు కేసిఆర్.

 

 

Related posts