telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దీక్షను భగ్నంచేసి బండి సంజయ్ ని ఆసుపత్రికి తరలింపు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షను భగ్నంచేసి ఆసుపత్రికి తరలించారు. బండి సంజయ్ ని సిద్ధిపేట వెళ్ళకుండా అరెస్ట్ చేసి వెనక్కు తీసుకువచ్చిన తర్వాత ఆయన నిరాహారదీక్ష ప్రారంభించినట్లు ప్రకటన చేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. పార్టీ కార్యాలయంలోనే సంజయ్ దీక్షలో కూర్చున్నారు. కార్యాలయంలో ఒంటరిగానే సంజయ్ దీక్షకు కూర్చున్నారు. అందువల్ల సంజయ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన షుగర్ లెవెల్స్ తాగుతున్నాయి. అందువల్ల ఆయన ఆరోగ్యపరిస్థితిపై పార్టీ ముఖ్యనేతల ఆరా తీస్తున్నారు. బండి సంజయ్ దీక్షకు దిగడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఈరోజు రాష్ట్రవ్యాప్త నిరసన దీక్షకు పిలుపునివ్వడం, నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటె, నిన్నటి నుంచి దీక్ష చేస్తున్న బండి సంజయ్ ఆరోగ్యం క్షిణించింది.  షుగర్ లెవల్స్ పడిపోయాయి.  దీంతో పోలీసులు ఎంపీ దీక్షను భగ్నం చేశారు.  వైద్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 

Related posts