నేడు హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతీ నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలును నడుపుతున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవం తిలకించేందుకు నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
సాధారణంగా మియాపూర్, ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయని, కానీ నేడు భక్తుల రద్దీ సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో రైలు సమయాన్ని పొడిగించినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.