ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సీఎస్ ను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేయడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు సీఎస్ బదిలీపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించనందునే బదిలీ చేసినట్టు భావిస్తున్నామని తెలిపారు. సీఎస్ ఆకస్మిక బదిలీపై ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ వ్యవహారం పరాకాష్టగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చెప్పేవాటికి, చేసేవాటికి పొంతన ఉండదని అన్నారు. ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేయడం నియంతృత్వమన్నారు.
కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది: యెడ్యూరప్ప