telugu navyamedia
రాజకీయ వార్తలు

మళ్లీ లాక్ డౌన్ ప్రచారంపై “మహా” సర్కార్ క్లారిటీ!

uddhav-thackeray-shivasena

కరోనా దెబ్బకు మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,97,535 కేసులు నమోదైతే అందులో కేవలం మహరాష్ట్రలోనే 97,648 కేసులు నమోదయ్యాయి. లక్ష కేసుల దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి.

జూన్ 15 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్విట్టర్ ద్వారా స్పందించింది. లాక్ డౌన్ ను మళ్లీ విధించే ప్రసక్తే లేదని ట్విట్టర్ లో తెలిపింది. ప్రజలు గుంపులుగా గుమికూడవద్దని ముఖ్యమంత్రి కోరారని పేర్కొంది. ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని విన్నవించారని తెలిపింది.

Related posts