పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తే 58 కోట్లు మిగిలాయని, పోలవరం టెండర్లలో రూ.780 కోట్లు మిగిలాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ గుర్తు చేశారు. గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ చేయకుంటే ఆ డబ్బంతా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లేదన్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేక రివర్స్ టెండరింగ్పై లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబాట్టారు.
పారదర్శకంగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగులుతుండడంతో అభినందించడం పోయి తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తుండడం దారుణమని ధ్వజమెత్తారు.రెండేళ్లలో పోలవరం పూర్తిచేసి చూపిస్తామని, అలాచేస్తే టీడీపీ నాయకులు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా? అని సవాల్ విసిరారు. ప్రస్తుతం వరద కారణంగా పనులు చేపట్టేందుకు అవకాశం లేదన్నారు. పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.