మరో టాలీవుడ్ దర్శకుడు తన టాలెంట్ తో బాలీవుడ్ కి వెళ్తున్నాడు. అయితే తెలుగులో నాచురల్ స్టార్ నానీ హీరోగా సంచలనం సృష్టించిన సినిమా జెర్సీ. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కథానియిగా కనిపించింది. దానికితోడు దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్ట్కి కూడా ఈ సినిమా ఎన్నికైంది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమెక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. హిందీలో ప్రధాన పాత్రగా షాహిద్ కపూర్ కనిపించనున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్తో పాటు టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవిండ్ దిల్ రాజు ఇందులో భాగస్వామ్యం తీసుకున్నారు. అయితే ఈ సినిమాను హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం చేయనున్నాడు. ఇందులో కథానాయికగా మృణల్ ఠాకుర్ కనిపించనుంది. ఇక కోచ్ పాత్రలో షాహిద్ తండ్రి పంకజ్ కపూర్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సినిమాతో టాలీవుడ్ దర్వకుడు గౌతమ్ బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నాడు.
previous post