telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చిరి సినిమాకి 20 కోట్లతో సెట్…

Aacharya

ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే కరోనా కారణంగా ఎంతో ఆలస్యం అయిన ఈ సినిమాను ఇక ఆలస్యం కాకుండా  పూర్తి చేయాలని చిరు ఆలోచించాడు. దాంతో తన షెడ్యూల్‌‌ను కూడా ఎంతో టైట్‌చేసుకొని మరీ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఇటీవల ఓ గ్రమం మొత్తం సెట్ వేశారట. దానికి దాదాపు రూ.20 కోట్లు  ఖర్చయిందట. అయితే మొదటగా ఓ గుడి సెట్‌ను  వేశారట దానికి రూ.4 కోట్లు అయ్యాయట. అక్కడ కొన్ని ముఖ్య మైన సన్నివేశాలను చిత్ర యూనిట్ రూపొందించింది. అయితే ఇప్పుడు కేరళాలోని ఒక గ్రామం సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. దాంతో గుడితో కలుపుకొని వారికైన ఖర్చు రూ.20 కోట్లు. ఈ గ్రామం సెట్ దాదాపు 16ఎకరాల విస్తీర్ణంతో వేశారని, ఈ సెట్‌కు కావలసిన వాటన్నింటిని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరీలో తిరిగి మొదలు కానుంది. ఇప్పటికి కొరటాల శివ దాదాపు 40శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి ఎగసాయి.

Related posts