telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

చాయ్ వాలా కి.. దేశాన్ని ఎందుకు అప్పగించారు..!, ధర్మదీక్షలో దుమారం లేపుతున్న ఓ పోస్టర్..

chaiwala poster in dharmadiksha viral

నేడు చంద్రబాబు ఏపీకి జరిగిన అన్యాయాన్ని గురించి దేశరాజధానిలో ధర్మ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో ఒక ఆసక్తికర పోస్టర్ కనపడింది. దానిలో చాయ్ వాలాకు దేశాన్ని ఎందుకు ఇచ్చారు అంటూ.. ప్రశ్న కనపడింది. దానిని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాము చేసిన తప్పును గుర్తుచేసుకుంటున్నారు. ఆంధ్రా భవన్‌లో రోజంతా ఈ దీక్ష జరుగుతుంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనల కోసం ఏపీకి వచ్చి తనను అటూ ఇటూ వాయించి వెళ్లిన మరుసటి రోజే బాబు ఈ దీక్ష చేస్తుండటం విశేషం.

దీక్షలో భాగంగా, మోదీ రాజధర్మాన్ని పాటించడం లేదని బాబు విమర్శించారు. అయితే ఈ దీక్షలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ దుమారం రేపుతున్నది. మోదీ పూర్వాశ్రమంలో చాయ్ అమ్మిన విషయాన్ని గుర్తు చేస్తూ ఓ ప్లకార్డును ఉంచారు. కడగాల్సిన టీ కప్పులను ఇవ్వాల్సినోడికి దేశాన్ని అప్పగించారు అని ఆ ప్లకార్డుపై రాసి ఉంది. ఇది తీవ్ర దుమారానికి దారి తీయడంతో టీడీపీ దీనిపై స్పందించింది. ఆ ప్లకార్డుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ చెప్పడం విశేషం. తమ పార్టీ కార్యకర్తలు ఆ ప్లకార్డును ఉంచలేదని చెప్పింది. ఇది సరి కాదు.. అలా చేయడం తప్పు. దానితో మాకు సంబంధం లేదు అని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

Related posts