జమ్ముకశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే సత్తా తనకు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని మరోసారి ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో వేదికను పంచుకున్న ట్రంప్ అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ అయ్యారు.
ఇమ్రాన్ తో భేటీకి ముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ, ‘నేను పాకిస్థాన్ ను నమ్ముతున్నా. కశ్మీర్ లో ప్రతి ఒక్కరు సమానంగా బతకాడాన్ని చూడాలనుకుంటున్నాని చెప్పారు. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరూ ఒప్పకుంటే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తా. ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు వీడనున్న ‘చంద్ర’ గ్రహణం: బీజేపీ నేత లక్ష్మణ్