telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిజేపీ తెలంగాణ రాకుండా మోసం చేసింది

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గారితో కలిసి ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళ హారతులు, బతుకమ్మ, బోనాల తో ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బిజెపి అంటే బాయిల కాడ మీటర్లు అని..టీఆర్ఎస్ అంటే 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అని పేర్కొన్నారు. గతంలో అర్ధరాత్రి దొంగ కరెంటు ఇచ్చేవారని..ఇప్పుడు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. మోటార్ కాలిపోతే 10000/- ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే 30000/- కడితతేనే ఇచ్చేవారని..దేశంలో బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సహాయం, రైతు భీమా, ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు బిజెపి వాళ్ళు వచ్చి బాయిలకాడ మీటర్లు పెట్టి రైతు చేతిలో బిల్లు పెడ్త అంటున్నారని..అందరూ ఆలోచించాలి..
ఎవరివైపు ఉంటారో ఎటు ఓటు వేయాలో ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ వచ్చాక నాలుగు సంవత్సరాల నుండి నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని..రాదనుకున్న తెలంగాణ తెచ్చారు కేసీఆర్ అని వెల్లడించారు. ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ ,బిజెపి వాళ్ళు మళ్ళీ వస్తారా.. కనబడతారా ఇక్కడ..మన ఇంట్లో వాళ్ళు ఎవరో బయటి వాళ్ళు ఎవరో గమనించాలని సూచించారు. బిజేపీ తెలంగాణ రాకుండా మోసం చేసిందని.. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు వానాకాలం రూ. 5000, యాసంగి కి రూ. 5000 చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10,000 పెట్టుబడి ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అని కొనియాడారు.

Related posts