రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేసింది. రాజమహేంద్రవరం లోక్సభ టీడీపీ అభ్యర్ధిగా మాగంటి రూప పేరు ఖరారైనట్టు సమాచారం. అభ్యర్థి పేరును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వారం రోజులపాటు పార్టీ అధిష్ఠానం పలు చర్చలు, అభిప్రాయ సేకరణ తర్వాత అధిష్ఠానం మాగంటి రూప పేరును ఖరారు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలియడంతో గుడా చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ వీరిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టిక్కెట్టు ఆశించిన బొడ్డుభాస్కరరామారావు తన అనుచరులతో సమావేశమై పార్టీ మారే ఆలోచన చేస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే సమీకరణాల నేపథ్యంలో తుది నిర్ణయంలో అభ్యర్థి మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎంపీ ధర్మపురి అరవింద్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన