ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న విశాఖలో లాంగ్ మార్చ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. లాంగ్ మార్చ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ పార్టీని నడిపించలేకపోతే సినిమాలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. దీనిపై పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు.
అవంతి గారు కాలేజీలు మూసివేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా? అంటూ ప్రశ్నించారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. మున్ముందు చేస్తానో లేదో తెలియదు కానీ, ప్రొడక్షన్ మాత్రం చేస్తాను అంటూ సినీ భవిష్యత్ పై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి