ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘జులాయి’, సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచి వీళ్ల కాంబినేషన్లో హాట్రిక్ హిట్ నమోదు చేసింది. ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ఫామ్లో కూడా ప్రదర్శితమై మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. నెల రోజుల క్రతం ఈ సినిమాకు సంబంధించిన ‘బుట్ట బొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్ను యూట్యూబ్లో రిలీజ్ చేసారు. ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. నెల రోజుల్లోనే ‘బుట్ట బొమ్మ సాంగ్ 98 మిలియన్ వ్యూస్ దక్కించుకోని నేడో..రేపో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోనుంది.
previous post
next post