telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై అధికారులతో జగన్ సమీక్ష సమావేశం

jagan

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ తన క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆయన చర్చిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంతో పాటు కరోనాపై పోరాడుతున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎన్ 95 మాస్కులు అందించడంపై ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే, లాక్‌డౌన్ పై కూడా ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌‌డౌన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యావసరాల రవాణా, రైతులను ఆదుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు.

Related posts