telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకాశ్మీర్ లో .. మహారాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు.. మొదటి రాష్ట్రం కూడా..

maharastra govt huge investments in J & K

మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది . జమ్మూకాశ్మీర్ లో భారీ పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది . కాశ్మీర్ లో రెండు రిసార్ట్స్ లను నిర్మిస్తామని ఎంటీడీసీ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో పెట్టుబడులు పెడుతున్న తొలి సర్కారుగా మహారాష్ట్ర ప్రభుత్వం రికార్డును సొంతం చేసుకోబోతోంది. రిసార్ట్స్ నిర్మాణం కోసం ల్యాండ్ సర్వే చేయాలని ఇప్పటికే ఎంటీడీసీ ని ఆదేశించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఆర్టికల్ 370 అమలులో ఉన్నప్పుడు కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల ప్రజలకూ భూములు కొనటానికి వీల్లేకుండా పోయింది. కాని పార్లమెంట్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో పాటు కశ్మీర్ ను విభజించింది.

దీంతో భారతదేశం నలుమూలల నుంచి జమ్మూ కాశ్మీర్ లో భూములు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. జమ్ము మరియు కాశ్మీర్ లో టూరిజం విస్తరించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. కాశ్మీర్ ను భూతల స్వర్గంగా పేరుంది. అందుకే అక్కడ రిసార్ట్స్ ను స్టార్ట్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం . కాశ్మీర్ తో పాటు లెహ్ లో కూడా పెట్టుబడులు పెడతామని తెలిపారు మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జయకుమార్ రావల్. జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ పట్టణంలో మహారాష్ట్ర ప్రభుత్వం పర్వతారోహకుల శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

Related posts