telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

గేదెల రుణం కోసం లంచం..సీబీఐకి చిక్కిన బ్యాంకు అధికారి

New couples attack SR Nagar

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారి గేదెల రుణం కోసం లంచం లక్ష రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పీఎన్‌బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్‌ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది.

గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్‌ సింగ్‌. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Related posts