telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఢిల్లీకి జగన్.. అమిత్ షాతో భేటీ!

jagan attending guntur iftar tomorrow

ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి 10:05కి విమానంలో ఢిల్లీ బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసమైన 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.

షాతో భేటీకి జగన్ ఇంతకుముందు మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉండడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య భేటీకి అవకాశం లభించలేదు. ప్రచారం ముగిసి నేడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజుఅమిత్‌షాను జగన్ కలవనున్నారు. రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌‌ తదితరులను కలుస్తారు. 

Related posts