telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రూ.500, 2000 నోట్లను చిత్తు కాగితాల్లా విసురుతూ… పెళ్ళి వేడుక… వీడియో వైరల్

Money

గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా.. వాణిజ్యవేత్తగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఖరీదైన కార్లు, గుర్రపు స్వారీలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గతవారం అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అతడి అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు. ఊరేగింపులో పాల్గొన్న జనాలపైకి నోట్ల వర్షం కురిపించారు. రూ.500, రూ.2000 నోట్లను చిత్తు కాగితాల్లా విసిరారు. రూ.కోటికి పైగా నోట్లను గాల్లోకి విసురుతూ సందడి చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు డబ్బులు విసురుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. టిక్‌టాక్ క్రేజ్‌తోనే వీరు ఇలా చేశారని అంటున్నారు. డబ్బులను అలా గాల్లోకి విసరడం చూసిన ప్రజలు.. నోరు వెళ్లబెడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ పెళ్లి కోసం జామ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లా గ్రామంలో భరాత్ నిర్వహించారు. వధువరులు ఈ వేడుక కోసం రోడ్డు మార్గంలో కాకుండా 20 కిలోమీటర్లు హెలికాప్టర్లో ప్రయాణించి వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో కూడా టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Jayraj&Luck (@jayrajluck) on

 

View this post on Instagram

 

A post shared by Jayraj&Luck (@jayrajluck) on

Related posts