telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బ్రేకింగ్ : మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. దీక్షిత్ కిడ్నాప్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాబు సేఫ్ గా ఉన్నాడని..పోలీసులు అదుపులో కిడ్నాపర్ ఉన్నాడని సమాచారం అందుతోంది. ఇవాళ 11 గంటలకు ఈ కేసుపై ప్రెస్ మీట్ పెట్టనున్నారు పోలీసులు. ఆ కుటుంబానికి కిడ్నాపర్ సన్నిహితుడని అంటున్నారు. కాగా..నాలుగు రోజులుగా పోలీసులకు చుక్కలు చూపెట్టిన బాలుడి కిడ్నాప్ గ్యాంగ్..ఐటీకోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా పురోగతి కన్పించలేదు. బాలుడి తల్లిఫోన్ కు కిడ్నాపర్లు ఫోన్లు చేసి బెదిరించారు. డబ్బు మూటతో కిడ్నాపర్లు చెప్పినచోటే రాత్రంతా పడిగాపులు కాసిన బాలుడి తండ్రి.. ఇంటర్ నెట్ కాల్ కావడంతో ట్రేసౌట్ పోలీసులు చేయలేకపోయారు. కిడ్నాప్ పై డీజీపీ మహేందర్ రెడ్డి తో స్థైతం కేటీఆర్ మాట్లాడారు. ఈ కేసులో పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు..కేసును ఎట్టకేలకు ఛేదించారు. బాలుడు దొరకడంతో ఆ తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts