telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయవాడ చేరుకున్న చంద్రబాబు

chandrababu

విజయవాడలోని అమరావతి జేఏసీ కార్యాలయానికి మాజీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాసేపట్లో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం జరగబోతోంది. అంతకు ముందే కార్యాలయానికి సీపీఐ నేత రామకృష్ణ చేరుకున్నారు. ఈ సమావేశం అనంతరం నేతలంతా ర్యాలీగా మచిలీపట్నం బయల్దేరనున్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. కుంటి సాకులతో బస్సు యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. మచిలీపట్నంకు వెళ్లే ర్యాలీని అడ్డుకుంటే ప్రభుత్వంతో తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.

Related posts