telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్‌ కూడా తెలుసు !

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందని…ప్రజల్లో కూడా ఆయనపై ఆగ్రహం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రేమ తో టీఆర్ఎస్ కు ఓటేసారని… ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ను దోచుకుంటుందని… కేసీఆర్ తన కార్యాలయంకు వెళ్ళక ఎన్ని నెలలైందో తేలీదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వం ప్రజలకోసం పనిచేస్తుందని.. లక్ష ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చి కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. నిజమైన బంగారు తెలంగాణను బీజేపీ చేసి చూపిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పైసాపైసాకు లెక్క ఉందని..పేదల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని తెలిపారు. ప్రజల ఓట్ల బలంతో ఆర్టికల్ 370 తొలగించామని.. అలాగే ఆయోధ్య రామ మందిరం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలన్న సంకల్పం తో ప్రతి ఒక్కరు పనిచేయాలని బీజేపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

Related posts