ఐసీసీ తాజాగా మళ్ళీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈరోజు ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ లిస్ట్లో 870 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. మరోవైపు స్టార్ పేస్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక హిట్మ్యాన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. వరుసగా అర్ధశతకం, శతకం బాదేసిన కేఎల్ రాహుల్ 31 నుంచి 27వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ జాబితాలో 42వ ర్యాంకు దక్కించుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత పేసర్ భువనేశ్వర్ కుమార్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. తొమ్మిది స్థానాలు మెరుగై 11వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో భువీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీ20ల్లో రాహుల్ కోహ్లీ ఒక్కో స్థానం దిగజారి 5, 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ లో కానీ, ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో గాని టాప్ 10 లో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు.
previous post
next post