telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ఉద్యోగులకు ఏపీ నుండి విడుదల…

ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్… తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన 711 ఉద్యోగులను రిలీవ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకారం తెలపడంతో ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్.. ఇక, తమను రిలీవ్ చేయడంతో ఏపీ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పాలాభిషేకం చేశారు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు… సెక్రటేరీయేట్ బయట టపాసులు కాల్చిన తెలంగాణ ఉద్యోగులు.. తమకి సహకరించిన ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక, సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు ఏపీ నుంచి రిలీవ్ అయిన 711 మంది తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు.. రిలీవ్ చేసినందకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Related posts