telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే…?

Covid-19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది.ఇప్పటికే ఏపీలో 8.70 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో  కేసులు నమోదవుతుండేవి.  కానీ, ఇప్పుడు కేసులు వందలకు వరకు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 599 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,70,675 కి చేరింది. ఇందులో 8,57,233 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,422కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 5 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,020 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 24, చిత్తూరులో 92, తూర్పుగోదావరి జిల్లాలో 60, గుంటూరులో 71, కడపలో 25, కృష్ణాలో 115, కర్నూలులో 13, నెల్లూరులో 23, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 41, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 8, పశ్చిమ గోదావరిలో 85 కేసులు నమోదయ్యాయి.

Related posts